మార్కెట్ గమనమెటు?
ABN , First Publish Date - 2020-03-27T05:52:48+05:30 IST
భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అ నూహ్యంగా పెరిగి పరిస్థితులు మరింత దిగజారితే, మార్కెట్ల పతనం కొనసాగనుంది...
భారత ఆర్థిక వ్యవస్థతోపాటు స్టాక్ మార్కెట్ భవిష్యత్ పూర్తిగా కరోనా నియంత్రణపైనే ఆధారపడి ఉంది. మా ర్కెట్, ఎకానమీ తీరుతెన్నులను నిర్దేశించే అవకాశాలు..
- భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అ నూహ్యంగా పెరిగి పరిస్థితులు మరింత దిగజారితే, మార్కెట్ల పతనం కొనసాగనుంది. ప్రపంచ ఆర్థిక వ్య వస్థ మాంద్యంలోకి జారుకోవడం ఖాయం. దేశ జీడీపీ వృద్ధి 3 శాతానికి పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
- దేశంలో కరోనాను విజయవంతంగా కట్టడి చేయగలిగి, ఏప్రిల్ 15 నుంచి లాక్డౌన్ ఎత్తేస్తే, ఈక్విటీల్లో కొనుగోళ్లు క్రమంగా పెరగనున్నాయి. మార్చి త్రైమాసిక వృద్ధికి భారీ గండిపడనున్నప్పటికీ.. మున్ముందు త్రైమాసికాల్లో మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుంది.
- కరోనా కేసులు భారత్లో అదుపులోకి వచ్చినప్పటికీ బయటి దేశాల్లో సంక్షోభం ముదిరితే, దేశీయ ఈక్విటీ సూచీల పనితీరు ప్రపంచ మార్కెట్ల కంటే కొద్దిగా మెరుగ్గా ఉండనుంది. కానీ, భారీ రికవరీని ఆశించవద్దు. మున్ముందు వృద్ధి మెరుగైనా ప్రపంచ మాంద్యం ప్రభావం మాత్రం స్పష్టంగా కన్పించనుంది.
- భారత్తోపాటు ప్రపంచ దేశాలూ కరోనాను సమర్థవంతంగా కట్టడి చేయగలిగితే, మార్కెట్లు త్వరగా కోలుకోవడంతోపాటు ఆర్థిక వ్యవస్థలు 4-5 నెలల్లో పునరుజ్జీవం పోసుకునేందుకు అవకాశం ఉంటుంది.