ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-04-11T01:23:08+05:30 IST

ఏపీలో భారీగా కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 3,309 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు

అమరావతి: ఏపీలో భారీగా కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 3,309 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో 9,21,906కి కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో  12 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 7,291 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18,666 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా నుంచి 8,95,949 మంది రికవరీ అయ్యారు. చిత్తూరులో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, విశాఖలో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. శ్రీకాకుళంలో ఇద్దరు, అనంతపురం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు.


తెలంగాణలో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా మరో 2,909 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఆరుగురు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 3,24,091కి చేరింది. ఇప్పటి వరకు కరోనా మహమ్మారితో 1,752 మరణాలు సంభవించాయి. తెలంగాణలో మొత్తం 17,791 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 

Updated Date - 2021-04-11T01:23:08+05:30 IST