పశ్చిమ గోదావరి: పాఠశాలల్లో సెంచరీ దాటిన కరోనా కేసుల సంఖ్య
ABN , First Publish Date - 2021-09-04T23:05:44+05:30 IST
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కేసుల సంఖ్య
పశ్చిమ గోదావరి: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కేసుల సంఖ్య సెంచరీ దాటింది. ఒక్కరోజే 11 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 9 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా సోకింది. జిల్లాలో మొత్తం 67 మంది విద్యార్థులు, 37 మంది టీచర్లతో కలిపి మొత్తం 104కు కరోనా కేసులు చేరాయి.