తూ.గోలో.. మళ్లీ పెరిగిన కేసులు
ABN , First Publish Date - 2020-08-03T17:50:16+05:30 IST
జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. తాజాగా నమోదైన..
22,201కి పాజిటివ్ బాధితులు
యాక్టివ్ కేసులు 15,468
కాకినాడ(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. తాజాగా నమోదైన 930పాజిటివ్లతో 22,201 కేసులకు చేరుకున్నాయి. 15,468 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 1న కాకినాడ అర్బన్లో 190, రూరల్లో 79, రాజమహేంద్రవరం అర్బన్లో 210, రూరల్లో 84 కేసులు వెలుగు చూశాయి. శనివారం జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాథమిక వైద్య, ఆరోగ్య కేంద్రాలు, ప్రధాన ఆస్పత్రుల్లో చేసిన కొవిడ్ పరీక్షల ఫలితాలు అధికారులు ఆదివారం ప్రకటించారు.