దేశంలో కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం

ABN , First Publish Date - 2021-06-17T14:49:15+05:30 IST

దేశంలో కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి.

దేశంలో కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 67,208 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా...2,330 మంది మృతి చెందారు. అలాగే కరోనా నుంచి కోలుకుని 1,03,570 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య 2,97,00,313కి చేరింది. కోలుకున్న వారి సంఖ్య 2,84,91,670గా ఉంది. దేశంలో ప్రసుత్తం 8,26,740 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,81,903గా ఉంది. ఇప్పటి వరకు 26,55,19,251 టీకా తీసుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారికంగా వెల్లడించింది.

Updated Date - 2021-06-17T14:49:15+05:30 IST