కడప జిల్లాలో కొత్తగా 600మందికి కరోనా.. ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2020-09-24T17:40:41+05:30 IST

జిల్లాలో మరో 600 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం..

కడప జిల్లాలో కొత్తగా 600మందికి కరోనా.. ముగ్గురి మృతి

కడప(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో 600 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 41,124కు చేరింది. మరో ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం 422 మంది మృతి చెందారు. చికిత్స పొంది కోలుకున్న 716 మందిని డిశ్చార్జి చేశారు. ఇప్పటి వరకు 37,497 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 2275 మంది హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-09-24T17:40:41+05:30 IST