కామారెడ్డి జిల్లాలో 65 కరోనా పాజిటివ్ కేసుల నమోదు
ABN , First Publish Date - 2020-08-14T17:32:03+05:30 IST
జిల్లాలో గురువారం 65 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు సమాచారం. జిల్లాలోని ఆయా పీహెచ్సీ, సీహెచ్సీల పరిధిలో నిర్వహించిన
కామారెడ్డి టౌన్(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం 65 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు సమాచారం. జిల్లాలోని ఆయా పీహెచ్సీ, సీహెచ్సీల పరిధిలో నిర్వహించిన ర్యాపిడ్ పరీక్షలలో 25 పాజిటివ్ కేసులు వచ్చినట్లు తెలిసింది. ఇందులో జిల్లా కేంద్ర ఆసుపత్రి 2, రాజీవ్నగర్ 5, దేవునిపల్లి 3, దోమకొండ 3, ఎల్లారెడ్డి 9, రాజంపేట 2, ఉత్తనూర్లో 1 కేసు నమోదయ్యాయి. కాగా కామారెడ్డి ఆసుపత్రి నుంచి పంపిన శాంపిళ్లలో 38 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. అంతేకాకుండా ఎల్లారెడ్డి ఆసుపత్రి పరిధిలో బుధవారం మిగిలిన శాంపిళ్ల ఫలితాలలో మరో 2 పాజిటివ్ కేసులు వచ్చినట్లు సమాచారం
భిక్కనూరులో ఐదుగురికి ..
భిక్కనూరు: రాజంపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలోని మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఇద్దరికి కొవిడ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి శిరీష్కుమార్ గురువారం తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడు తూ రాజంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 28 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా భిక్కనూరు మండల ంలోని జంగంపల్లి గ్రామానికి చెందిన ఇద్దరికి పాజిటీవ్ వచ్చిందని తెలిపారు.