కర్ణాటకలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-03-06T15:57:15+05:30 IST
కర్ణాటక రాష్ట్రంలో రోజురోజుకు కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి...
బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలో రోజురోజుకు కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. వారం క్రితం 350 లోపు కేసులు నమోదు కాగా శుక్రవారం ఏకంగా 677 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. బెంగళూరులో 444 మందికి వైరస్ సోకింది. దీంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 9.53 లక్షలకు పెరిగింది. 427 మంది కోలుకోగా 9.35 లక్షలమంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నలుగురితో కలిపి ఇప్పటి వరకు 12,354 మంది మృతి చెందారు. ఇంకా 6,374 మంది చికిత్స పొందుతున్నారు.