కృష్ణా జిల్లాలో.. కొత్తగా 548 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-05-07T17:04:04+05:30 IST

జిల్లాలో గురువారం కొత్తగా..

కృష్ణా జిల్లాలో.. కొత్తగా 548 కరోనా కేసులు

మరో నలుగురు పాజిటివ్‌ బాధితులు మృతి 


ఆంధ్రజ్యోతి-విజయవాడ: జిల్లాలో గురువారం కొత్తగా 548 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరో నలుగురు బాధితులు మరణించారు. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 66,811 కి చేరుకున్నాయి. కొవిడ్‌ మరణాలు అధికారికంగా 799 కి పెరిగాయి. ఇంకా 8,520 మంది పాజిటివ్‌ బాధితులు కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2021-05-07T17:04:04+05:30 IST