కృష్ణా జిల్లాలో కరోనాతో ఏడుగురి మృతి

ABN , First Publish Date - 2021-05-12T16:19:10+05:30 IST

జిల్లావ్యాప్తంగా విషం చిమ్ముతున్న..

కృష్ణా జిల్లాలో కరోనాతో ఏడుగురి మృతి

కొత్తగా 948 మందికి వైరస్‌ 


ఆంధ్రజ్యోతి-విజయవాడ: జిల్లావ్యాప్తంగా విషం చిమ్ముతున్న కరోనా మహమ్మారి మంగళవారం మరో ఏడుగురు బాధితులను బలి తీసుకుంది. గత 24 గంటల్లో కొత్తగా 948 మందికి వైరస్‌ సోకింది. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 71,572 కి చేరుకుంది. కొవిడ్‌ మరణాలు అధికారికంగా 825 కి పెరిగాయి. ఇంకా 9,074 మంది పాజిటివ్‌ బాధితులు కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


Updated Date - 2021-05-12T16:19:10+05:30 IST