కృష్ణా జిల్లాలో.. మరో 146 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-08-11T12:57:55+05:30 IST

జిల్లాను కుదిపేస్తున్న కరోనా మహమ్మారి సోమవారం కాస్త శాంతించినట్లు..

కృష్ణా జిల్లాలో.. మరో 146 మందికి కరోనా

24 గంటల్లో 113 మంది డిశ్చార్జి


(ఆంధ్రజ్యోతి-విజయవాడ): జిల్లాను కుదిపేస్తున్న కరోనా మహమ్మారి సోమవారం కాస్త శాంతించినట్లు కనిపించింది. జిల్లాలో పది రోజులుగా ప్రతిరోజూ 300 నుంచి 400 పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా.. సోమవారం 146 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అదేవిధంగా కరోనా మరణాలు కూడా ప్రతిరోజూ నమోదవుతుండగా సోమ వారం అధికారికంగా ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాకపోవడం గమనార్హం. కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,438 చేరుకోగా కరోనా మరణాల సంఖ్య నిలకడగా 212 వద్దే ఉంది. గడచిన 24 గంటల్లో 113 మంది కరోనా బాధితులు వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి చేరుకోగా ఇంకా 3,651 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు


Updated Date - 2020-08-11T12:57:55+05:30 IST