పాక్‌లో 50వేలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-05-22T22:47:14+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి.. దాయాది దేశం పాకిస్తాన్‌లో విజృంభిస్తోంది.

పాక్‌లో 50వేలు దాటిన కరోనా కేసులు

ఇస్లామాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి.. దాయాది దేశం పాకిస్తాన్‌లో విజృంభిస్తోంది. ఇక్కడ గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,603 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి పాక్‌లో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కరోనా కేసుల సంఖ్య ఇదే. దీంతో ఈ దేశంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 50,694కు చేరింది. అలాగే కొత్తగా కనీసం 50 కరోనా మరణాలు సంభవించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇక్కడ సంభవించిన కరోనా మరణాల సంఖ్య 1,067కు చేరింది. ఇప్పటి వరకు 15,201మంది కరోనా బాధితులు కోలుకున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2020-05-22T22:47:14+05:30 IST