ప్రకాశం జిల్లాలో కొత్తగా 317 మందికి పాజిటివ్‌ కేసులు.. ఐదుగురు మృతి

ABN , First Publish Date - 2020-08-14T19:18:15+05:30 IST

కొవిడ్‌ వైరస్‌ వెంటాడుతుంది. గురువారం జిల్లాలో 317పాజిటివ్‌ కేసులు నమోదు కాగా..

ప్రకాశం జిల్లాలో కొత్తగా 317 మందికి పాజిటివ్‌ కేసులు.. ఐదుగురు మృతి

ఒంగోలు(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ వైరస్‌ వెంటాడుతుంది. గురువారం జిల్లాలో 317పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతిచెందారు. బుధవారంతో పోల్చుకుంటే సగానికిపైగా కేసులు తగ్గుముఖం పట్టాయి. గురువారం వెలువడిన ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఒంగోలులో 42 కేసులు నమోదు కాగా అద్దంకిలోనూ 42 కేసులు నమోదయ్యాయి. మార్కాపురం 9, కందుకూరు 14, చీరాలలో 9 కేసులు వెలుగుచూశాయి. అయితే కరోనా నిరాఽ్ధరణ పరీక్షలకు ర్యాపిడ్‌ కిట్ల కొరత కారణంగా పరీక్షలు లేకపోవడంతో కేసుల సంఖ్య తగ్గినట్లు తెలుస్తుంది. వీఆర్‌డీఎల్‌ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తుండగా, రిపోర్టులు వచ్చేందుకు వారంరోజుల పడుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. 


Updated Date - 2020-08-14T19:18:15+05:30 IST