రాజస్థాన్‌లో 7500 దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-05-27T04:49:38+05:30 IST

దేశాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. ఈ క్రమంలో ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో కూడా వైరస్ విజృంభిస్తోంది.

రాజస్థాన్‌లో 7500 దాటిన కరోనా కేసులు

జైపూర్: దేశాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. ఈ క్రమంలో ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో కూడా వైరస్ విజృంభిస్తోంది. ఈ రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 236 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,536కు చేరింది. అలాగే కొత్తగా మూడు కరోనా మరణాలు సంభవించినట్లు అధికారులు చెప్పారు. దీంతో మొత్తం రాష్ట్రంలో సంభవించిన కరోనా మరణాల సంఖ్య 170కి చేరిందని వారు తెలియజేశారు. అదే సమయంలో మొత్తం 4,276 మంది కరోనా బాధితులు కోలుకున్నారని, వారిలో 3,767మంది ఇప్పటికే ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని పేర్కొన్నారు.

Updated Date - 2020-05-27T04:49:38+05:30 IST