యూపీలో విజృంభిస్తున్న కరోనా.. నేడు 1700 దాకా..

ABN , First Publish Date - 2020-07-14T00:35:22+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రోజురోజుకూ...

యూపీలో విజృంభిస్తున్న కరోనా.. నేడు 1700 దాకా..

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రోజురోజుకూ కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 38వేలు దాటేసింది. అధికారిక లెక్కల ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,664 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 21 మంది మరణించారు. 869 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 38,130కి చేరింది. వీరిలో 12,972మంది చికిత్స పొందుతుండగా 24,203మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా 955మంది మృత్యువాతపడ్డారు.

Updated Date - 2020-07-14T00:35:22+05:30 IST