కరోనాతో 11 మంది మృతి.. కొత్తగా 580 పాజిటివ్ కేసులు నమోదు
ABN , First Publish Date - 2020-08-04T21:52:14+05:30 IST
జిల్లాలో కరోనా వైరస్కు సోమ వారం ఒక్కరోజే 11 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు జిల్లాలో ఒక్కరోజులో ఇంతమంది మృతి చెందడం ఇదే ప్రథమం. సోమవారం కూడా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
ఏలూరులో అత్యధికంగా 85
ఇప్పటివరకు మొత్తం కేసులు14,988
ఏలూరు (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్కు సోమ వారం ఒక్కరోజే 11 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు జిల్లాలో ఒక్కరోజులో ఇంతమంది మృతి చెందడం ఇదే ప్రథమం. సోమవారం కూడా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో 580 కేసులు నమోదు కావడంతో ఇప్పటివరకు 14,988 కేసులు నమోద య్యాయి. ఏలూరులో రెండు రోజులుగా కరోనా ఉధృతి తగ్గినట్లు కనిపిం చినా ఒక్కరోజులో 85 కేసులు నమోదు కావడంతో కరోనా వ్యాప్తి నియంత్రణలోకి రాలేదు. జంగారెడ్డిగూడెం 50, భీమవరంలో 45 కేసులు నమోదయ్యాయి. నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, కొవ్వూరు పట్టణాల్లో కేసుల సంఖ్య కొంచెం తగ్గినట్లు కనిపిస్తోంది. తాడే పల్లిగూడెంలో 29, మిగిలిన చోట్ల 20 కేసులు చొప్పున నమోద య్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. చాగల్లు మండలంలో 25, పోలవరంలో 14, కాళ్ళ 12, పెదపాడు 12, పోడూరు, పాలకొడేరు 10 కేసుల చొప్పున నమోదయ్యాయి. బుట్టాయగూడెం, ఉం డ్రాజవరం, పెదవేగి, ఆకివీడు, ఆచంట, ద్వారకాతిరుమల, జీలుగుమిల్లి, భీమడోలు, పెరవలి, చింతలపూడి, గణపవరం, పెనుమంట్ర, గోపాల పురం, భీమడోలు మండలాల్లో 5 కంటె తక్కువ కేసులు నమోదయ్యాయి.
కొత్తగా 25 కంటైన్మెంట్ జోన్లు... 12 జోన్లు తొలగింపు
ఏలూరు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో నూతనంగా 25 కంటైన్మెంట్ జోన్లను జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు సోమవారం ప్రకటించారు. తణుకు మండలం తేతలి, చింతలపూడి మండలం శివపురం 10వ వార్డు, బట్టువారిగూడెం 19వ వార్డు, దెందులూరు మండలం పెరుగుగూడెం 3వ వార్డు, ద్వారకాతిరుమల మండలం ఎం నాగులపల్లి 9వ వార్డు, సరభపురం 8వ వార్డు, పి కన్నాపురం 3వ వార్డు, 14వ వార్డు, పాలకోడేరు మండలం మోగల్లు 3వ వార్డు, పెనుగొండ మండలం తామరాడ, తాడేపల్లిగూడెం రూరల్ ఆరుగొలను 4, 5 వార్డులు, నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం 12వ వార్డు, పెదపాడు మండలం సీతారామపురం 7వ వార్డు, సౌరిపురం 16వ వార్డు, చాగల్లు మండలం చాగల్లు 8వ వార్డు, ఏలూరు అర్బన్ 2, 16 వార్డులు, ఇరగవరం మండలం రేలంగి 9వ వార్డు, అర్జునుడుపాలెం 5వ వార్డు, టినర్సాపురం మండలం అప్పలరాజుగూడెం 2వ వార్డు, కొయ్యలగూడెం మండలం వేదాంతపురం, భీమడోలు మండలం కోడూరుపాడు, ఉండి మండలం పాండువ్వ, భీమవరం మండలం కోమటితిప్పలను కంటైన్మెంట్లుగా ప్రకటించారు.
తొలగించినవి: కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదు కాని 12 కంటైన్మెంట్జోన్లను తొలగిస్తున్నట్టు కలెక్టర్ రేవు ముత్యాలరాజు తెలిపారు. గణపవరం మండలం వరదరాజపురం 1నుంచి 4 వార్డులు, ఏలూరు రూరల్ శనివారపుపేట 4వ వార్డు, అశోక్నగర్ 10వ వార్డు, పెదపాడు మండలం కొత్తముప్పర్రు 8వ వార్డు, ఏలూరు అమీనాపేట 25వ వార్డు, ఇరగవరం మండలం గోటేరు 8వ వార్డు, తాడేపల్లిగూడెం అర్బన్ సామవేదంవారి వీధి 22 నుంచి 24, 26, 30, 29, 2 వార్డులు, పిఅండ్టి కాలనీ 6, 7, 11వార్డులు, ఏపీహెచ్బి కాలనీ 35వ వార్డు, ఆకివీడు మండలం దుంపగడప 7 నుంచి 10 వార్డులు, పెరవలి మండలం ఇందిరమ్మకాలనీ 12 వార్డులలో కంటైన్మెంట్ ఆపరే షన్లు నిలుపుదల చేశారు.