కరోనా.. భయాన.. ఒక్కరోజే 509 కేసులు

ABN , First Publish Date - 2020-08-05T17:53:36+05:30 IST

కరోనా భయపెడుతూనే ఉంది.. ఇంకా 500 దాటి కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో మంగళవారం 509 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 15 వేలు మార్క్‌ దాటేసింది.

కరోనా.. భయాన.. ఒక్కరోజే 509 కేసులు

15,497కు చేరిన సంఖ్య.. భీమవరంలో తగ్గని ఉధృతి

ఏలూరుకు కాస్త ఉపశమనం.. అన్ని మండలాలకు వ్యాప్తి


ఏలూరు (ఆంధ్రజ్యోతి): కరోనా భయపెడుతూనే ఉంది.. ఇంకా 500 దాటి కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో మంగళవారం 509 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 15 వేలు మార్క్‌ దాటేసింది. వీటిలో 67 కేసులు ఒక్క భీమవరం మండలంలోనే నమోదయ్యాయి. గడచిన నాలుగైదు రోజులుగా భీమవరం మండలంలో కేసులు పెరగ డం ఆందోళన కలిగిస్తోంది.ఏలూరులో 45 కేసులు నమోదయ్యాయి. అయితే తాడేపల్లిగూడెం 24, తణుకు 23, కొవ్వూరు 17 కేసులతో కొంచెం పరవాలేదనిపించాయి.పోడూరు 18, కొయ్యలగూడెం, నల్ల జర్లలో 16 కేసులు చొప్పున, గణపవరంలో 14 కేసులు నమోద య్యాయి.వీటితో పాటు కాళ్ల, వీరవాసరం, భీమడోలు, నరసాపురం, ఆకివీడు,నిడదవోలు, దేవరపల్లి, యలమంచిలి, పెంటపాడు, ఉంగు టూరు, బోగోలు, పోలవరంలో 10 కంటే ఎక్కువ కేసులు నమోద య్యాయి.పాలకొల్లు, జంగారెడ్డిగూడెం ఆరు కేసులు చొప్పున నమోద వడం కొంత ఉపశమనం కలిగిస్తుంది.పాలకోడేరు, ఉండి,గోపాలపురం, ఆచంట,చాగల్లు,పెరవలి,పెనుగొండ,వీరవాసరం, పెదపాడు, ఇరగవరం, మొగల్తూరు మండలాల్లో ఐదు కంటే తక్కువ కేసులు నమోద య్యాయి.మంగళవారం కరోనా కారణంగా ఒకరు మృతిచెందారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకూ 15,497 కేసులు నమోదయ్యాయి.  


కొత్తగా 37 కంటైన్మెంట్‌ జోన్లు 

జిల్లాలో నూతనంగా 37 కంటైన్మెంట్‌ జోన్లు ప్రకటించడం జరిగిందని కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు మంగళవారం తెలిపారు.ఇరగవరం మండలం పేకేరు 3వ వార్డు, జంగారెడ్డిగూడెం మం డలం మైసమ్మగూడెం 9వ వార్డు, లక్కవరం 12వ వార్డు, పేరంపేట 10, 12 వార్డులు, జీలుగుమిల్లి మండలం పి.రాజవరం 1, 2, 3, 8, 10 వార్డులు, రౌతుగూడెం 10వ వార్డు, నల్లజర్ల మండలం తెలికిచర్ల 3వ వార్డు, నబీపేట 2వ వార్డు, నిడదవోలు అర్బన్‌ 2, 4, 12, 19, 5, 15, 27, 28, 20 వార్డులు,భీమవరం అర్బన్‌ 12, 19వ వార్డు, కాళ్ళ మండలం జువ్వలపాలెం 12,8 వార్డులు,తాడేపల్లిగూడెం రూరల్‌ రామన్న గూడెం 6, 7, 8 వార్డులు, వీరవాసరం మండలం కొణితివాడ,చాగల్లు మండలం మార్కొండపాడు 5వ వార్డు, దేవరపల్లి మం డలం బంధపురం 1, 2, 4, 5 వార్డులు, పెను మంట్ర మండలం 4, 5, 6 వార్డులు, పోల వరం మండలం తూటిగుంట, తాళ్ళ పూడి మండలం రావూరుపాడు 12వ వార్డు, పెదవేగి మండలం జానంపేట 4వ వార్డు, పెరవలి మండలం నల్లాకుల వారిపాలెం 13వ వార్డు, ఉంగుటూరు మండలం గొల్లగూడెం 6వ వార్డు, కొయ్యలగూడెం మండలం రాజవరం గంగవరం 13, 14 వార్డులు, బుట్టాయగూడెం 11, 12, 13 వార్డులు, పరింపూడి 8వ వార్డు, కన్నాయగూడెం 11వ వార్డు, పరిమిపూడి ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. 


సాయం చేసిన చేతులే దూరమయ్యాయి

సాయం చేసిన చేతులే దూరమయ్యాయి. కరోనా లక్షణాలతో తాళ్లపూడికి చెందిన ఒక వృద్ధుడు (63) ఆశ్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. ఇటీవలే కరోనా రెడ్‌జోన్‌లో పలువురికి సాయం అందజేశారు. ఇంతలోనే ఆయన కరోనా బారిన పడి మృతిచెందడం పట్ల గ్రామస్థులు సంతాపం తెలిపారు. రెండు రోజుల్లో తిరిగి వస్తారని ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు సమాచారం తెలిసిన వెంటనే తల్లడిల్లిపోయారు.

Updated Date - 2020-08-05T17:53:36+05:30 IST