ప్రకాశం జిల్లా వాసులను ఆందోళనకు గురి చేస్తున్న కరోనా

ABN , First Publish Date - 2020-07-10T13:45:32+05:30 IST

ప్రకాశం: జిల్లా వాసులను కరోనా ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా మరో 128 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ప్రకాశం జిల్లా వాసులను ఆందోళనకు గురి చేస్తున్న కరోనా

ప్రకాశం: జిల్లా వాసులను కరోనా ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా మరో 128 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు 1321 కరోనా పాజిటివ్ కేసలు నమోదయ్యాయి. నిన్న అత్యధికంగా పామూరులో 35, అలవలపాడు 16, ఒంగోలు 13 సహా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. నిన్న జిల్లాలో ఇద్దరు డాక్టర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది.


అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్‌కు.. బల్లికురవ మండలం అంబడిపూడి పశువైద్యాధికారికి కరోనా పాజిటివ్ అని తేలింది.జిల్లాలో ఇప్పటి వరకు 24 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం 96,612 శ్యాంపిళ్లను పంపించారు. నెగిటివ్ ఫలితాలు వచ్చినవి 90,289 కాగా.. ఇంకా రిపోర్టులు రావాల్సినవి 5135. జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్లలో 765 మంది ఉన్నారు. 


నిన్న కరోనా నుంచి కోలుకుని 70 మంది డిశ్చార్జ్ అయ్యారు.


ఇప్పటి వరకూ కరోనా బారి నుంచి కోలుకుని 767 మంది డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాలో ప్రస్తుతం 554 యాక్టివ్ కేసులున్నాయి. 

Updated Date - 2020-07-10T13:45:32+05:30 IST