జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-02-24T04:43:25+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం 13 కేసులు నమోదయ్యాయి.

జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

పెద్దబజార్‌, ఫిబ్రవరి 23 : జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం 13 కేసులు నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా 503 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 13 కేసులు నమోదయ్యాయి. కరోనా వచ్చిన వారికి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కౌన్సెలింగ్‌ చేయడంతో పాటు కావాల్సిన మందులను అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు లక్షా 56 వేల 27 మందికి పరీక్షలు నిర్వహించగా 15803 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. జిల్లాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం సూచించారు.

Updated Date - 2021-02-24T04:43:25+05:30 IST