ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-03-22T00:30:29+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ మళ్లీ పంజా విసురుతోంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 368

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ మళ్లీ పంజా విసురుతోంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 368 మందికి కరోనా సోకింది. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో 8,93,734కు  కరోనా కేసులు చేరాయి. గడిచిన 24 గంటల్లో కరోనా మరణాలు సంభవించలేదు. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా 7,189 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 2,188 యాక్టివ్ కేసులున్నాయి. ముఖ్యంగా పాఠశాలలపై కరోనా కోరలు చాస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా బడుల్లో పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహిస్తోన్న వేళ కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. గణనీయమైన సంఖ్యలో విద్యార్థులు కొవిడ్‌-19 మహమ్మారి బారిన పడుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు తదితర లక్షణాలు విద్యార్థుల్లో కనిపిస్తున్నాయి. బడికి వెళ్లకపోతే హాజరు సమస్య .. వెళితే కరోనా భయం.. ఈ రెండింటి మధ్య చిన్నారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. 

Updated Date - 2021-03-22T00:30:29+05:30 IST