తెలంగాణలో అనూహ్యంగా పెరుగుతున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-04-11T15:53:00+05:30 IST

తెలంగాణలో అనూహ్యంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 3,187 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో అనూహ్యంగా పెరుగుతున్న కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో అనూహ్యంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 3,187 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనాతో ఏడుగురు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 1,759 మంది మృతి చెందారు. తెలంగాణలో ప్రస్తుతం 20,184 యాక్టివ్‌ కేసులున్నారు. 13,366 మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్‌‌లో చికిత్స తీసుకుంటారు. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 551 కేసులు నమోదయ్యాయి.


రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే కొద్ది రోజుల్లోనే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలు దొరకడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ పడకలు దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - 2021-04-11T15:53:00+05:30 IST