జానకంపేట పోలీస్ శిక్షణ కేంద్రంలో కరోనా కలకలం
ABN , First Publish Date - 2020-08-14T11:18:36+05:30 IST
ఎడపల్లి మండలం జా నకంపేట పోలీస్శిక్షణ కేంద్రాన్ని కరోనా భ యాందోళనకు గురి చే స్తోంది. వారం క్రితం నలుగురు శిక్షణ పోలీ సులకు కరోనా పాజి
శిక్షణ పోలీసులకు కొవిడ్-19 పాజిటివ్
30 మందికి పైనే బాధితులు
అక్కడే క్వారంటైన్
బోధన్, ఆగస్టు 13 : ఎడపల్లి మండలం జా నకంపేట పోలీస్శిక్షణ కేంద్రాన్ని కరోనా భ యాందోళనకు గురి చే స్తోంది. వారం క్రితం నలుగురు శిక్షణ పోలీ సులకు కరోనా పాజి టివ్ రాగా తాజాగా ఈ సంఖ్య 30 మంది వరకు చేరినట్లు తెలు స్తోంది. పోలీస్ శిక్షణ కేంద్రంలో పెద్ద సంఖ్యలో ట్రైనీ పోలీసులు ఉండడంతో ఆందళన వ్యక్త మ వుతోంది. ప్రస్తుతం ఇక్కడ సైబరాబాద్ జోన్ ట్రాఫిక్ పోలీస్ కాని స్టేబు ళ్లకు శిక్షణ ఇస్తుండడంతో భయాందోళన వ్యక్తమవుతోంది. జిల్లా కేం ద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో శిక్షణ పోలీసులు కరోనా పరీక్షలు చేయిం చ డంతో రోజుకు కొద్ది మందికి పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇ ప్పటికే వీరందరినీ ఇక్కడే శిక్షణ కేంద్రంలో క్వారంటైన్లో ఉంచారు. కరోనా సోకిన వారికి ప్రత్యేక గదులు కేటాయించే పరిస్థితులు లేకపోవడం కేసుల సంఖ్య పెరుగుతుండడం పోలీస్శాఖను కలవరపాటుకు గురి చేస్తోంది.