టీకాతోనే కరోనా నియంత్రణ సాధ్యం

ABN , First Publish Date - 2022-01-28T05:41:28+05:30 IST

అర్హులైన ప్రతి ఒక్కరూ కొవిడ్‌ టీకా వేయించుకుంటేనే కరోనాను నియంత్రించగలమని డీఎంహెచ్‌ వో కొమురం బాలు అన్నారు.

టీకాతోనే కరోనా నియంత్రణ సాధ్యం
ప్రికాషన్స్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న డీఎంహెచ్‌వో కొమురం బాలు

- డీఎంహెచ్‌వో కొమురం బాలు

మంచిర్యాల కలెక్టరేట్‌, జనవరి 27 : అర్హులైన ప్రతి ఒక్కరూ కొవిడ్‌ టీకా వేయించుకుంటేనే కరోనాను నియంత్రించగలమని  డీఎంహెచ్‌ వో కొమురం బాలు అన్నారు.  జిల్లాకేంద్రంలోని చున్నంబట్టివాడ, పాత మంచిర్యాల, రంగంపేటలలో రెండో డోసు, ప్రికాషనరీ డోస్‌ ప్రక్రియను గురువారం ఆయన పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో డోసు వంద శాతం పూర్తి చేసేందుకు, బూస్టర్‌ ప్రికాషనరీ డోస్‌ విజయవంతంగా వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రత్యేక టీం సభ్యులతో 16  మంది ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ, ఆర్‌పీలు, 14 బృందాలతో ప్రజలకు టీకా వేసుకునేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌కు సహకరించాలన్నారు.  కార్యక్రమంలో జిల్లా కొవిడ్‌ సర్వేలెన్స్‌ అధికారి బాలాజీ, మెడికల్‌ ఆఫీసర్‌ రమేష్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ శ్రీనివాస్‌, సబ్‌ యూనిట్‌ అధికారి నాందేవ్‌, సూపర్‌ వైజర్‌ అపర్ణ పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-28T05:41:28+05:30 IST