కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2020-08-04T11:36:20+05:30 IST
కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యలు వేగవంతం చేయాలని, ప్రభుత్వం సూచించిన ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులలో ..
కాకినాడ(డెయిరీఫారమ్ సెంటర్), ఆగస్టు 3: కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యలు వేగవంతం చేయాలని, ప్రభుత్వం సూచించిన ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులలో అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మొర్త రాజశేఖర్, సీపీఎం నగర కార్యదర్శి సీహెచ్ అజయ్కుమార్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు జె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ టెస్ట్లకు కిట్లు సరిపోవడం లేదన్నారు. అనంతరం వినతిపత్రాన్ని డీఆర్వో సత్తిబాబు, జాయింట్ కలెక్టర్ చేకూరి కీర్తికు వినతిపత్రం సమర్పించారు. ఫార్వర్ట్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి అయినాపురపు సూర్యనారాయణ, సీపీఎం నాయకులు జుత్తుగ శ్రీనివాస్, కె.వీరబాబు, కె.చిన్నరాజు పాల్గొన్నారు.