గాంధీభవన్లో కరోనా కంట్రోల్ రూమ్ ఏర్పాటు: ఉత్తమ్
ABN , First Publish Date - 2020-03-30T19:00:02+05:30 IST
నగరంలోని గాంధీభవన్లో కరోనా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు..
హైదరాబాద్: నగరంలోని గాంధీభవన్లో కరోనా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనాతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కాంగ్రెస్ సహాయసహకారాలు అందిస్తుందని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులుంటే 040-24601254 కాల్ చేయాలని సూచించారు. ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు రెండు షిఫ్టులుగా గాంధీభవన్లో ఉంటారని, అవసరాన్ని బట్టి కాంగ్రెస్ నేతలు సహకారమందిస్తారని ఉత్తమ్ తెలిపారు.