కరోనాతో ఉపాధ్యాయుడి మృతి
ABN , First Publish Date - 2021-05-06T05:40:46+05:30 IST
కరోనాతో ఉపాధ్యాయుడి మృతి
జగ్గయ్యపేట: పట్టణంలోని ఎయిడెడ్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జి. సాయికుమార్ కరోనాతో మృతి చెందారు. గత నెల 25న సూర్యాపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లారు. అక్కడ చికిత్సకు పరిస్థితి మెరుగు కాకపోవటంతో అతడిని విజయవాడకు అంబులెన్స్లో తీసుకెళ్తుండగా జగ్గయ్యపేట సమీపంలో మృతి చెందారు. బంధువులు, ఉపాద్యాయ సంఘ నేతలు మున్సిపల్ కమిషనర్ చంద్రబోస్ను సంప్రదించగా సిబ్బందిని పంపించి స్మశాన వాటికలో దహన కార్యక్రమాలు నిర్వహించారు. కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్ రాంబాబు, సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
నందిగామ జడ్పీ పాఠశాల రికార్డు అసిస్టెంట్..
నందిగామ రూరల్: నందిగామ జడ్పీ పాఠశాల రికార్డు అసిస్టెంట్ కోట లక్ష్మయ్య కరోనాతో బుధవారం మృతి చెందారు.