బ్రిటన్లో మరణ మృదంగం.. 24గంటల్లో 938 మంది మృతి!
ABN , First Publish Date - 2020-04-09T06:04:43+05:30 IST
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. కరోనా కాటుకు బ్రిటన్లో 24 గంటల్లో 938 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు బ్రిటన్లో మరణించిన
లండన్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. కరోనా కాటుకు బ్రిటన్లో 24 గంటల్లో 938 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు బ్రిటన్లో మరణించిన వారి సంఖ్య 7వేలు దాటింది. 2,32,708 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 60,733 మందికి పాజిటివ్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 15లక్షల మందికి వైరస్ సోకగా.. మరణించిన వారి సంఖ్య 86,750కి చేరింది.