కరోనా కాటుకు ఇద్దరు బలి
ABN , First Publish Date - 2021-05-11T06:32:25+05:30 IST
కరోనా కాటుకు ఇద్దరు బలి
ఐనవోలు, మే 10 : టీఆర్ఎస్ జిల్లా నాయకుడు హన్మకొండ రూరల్ మండలం మాజీ జడ్పీటీసీ శ్రీరామోజి అరుణ భర్త జయకర్ (50) కరోనా కాటుకు బలయ్యాడు. స్థానికుల వివరాల మేరకు.. కొండపర్తి గ్రామానికి చెందిన జయకర్ స్థానిక పీహెచ్సీలో రెండు రోజుల కిందట కొవిడ్ నిర్ధారణ పరీక్ష చేసుకోగా పాజిటివ్గా తేలింది. శ్వాసకోశ ఇబ్బందులు రావడంతో సత్వరమే ఏదైన ఆస్పత్రిలో అడ్మిట్ కావాలని వై ద్యులు సూచించారు. నగరంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో సం ప్రదించగా బెడ్ లభించలేదు. చివరికి ఎంజీఎం కొవిడ్ వార్డులో చేరగా ఆరోగ్యం క్షీణించి సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు ని ర్వహించారు. జయకర్కు భార్య అరుణ, కుమారుడు, కూతురు ఉన్నారు. ఐనవోలులో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదో వార్డు సభ్యురాలు తాటికాయల శాంత (40) తెల్లవారుజామున ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలికి భర్త బాబు, ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నారు.
కమలాపూర్లో ఇద్దరు మహిళలు..
49 మందికి పాజిటివ్..
కమలాపూర్ : మండలకేంద్రానికి చెందిన ఓ మహిళ (47), ఓ వృద్ధురాలు (65) కరోనా కారణంగా మృతి చెందారు. గ్రామస్థుల వివరాల మేరకు.. ఇటీవల ఇద్దరు కరోనా బారిన పడగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన 49 మందికి సోమవారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. ఉప్పల్ పీహెచ్సీలో 50 మందికి పరీక్షలు చేయగా వారిలో 20 మందికి కరోనా సోకిందని, కమలాపూర్ పీహెచ్సీలో 51 మందికి పరీక్షలు చేయగా వారిలో 29 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు.