బ్రిటన్లో 34వేలకు చేరిన కరోనా మరణాలు
ABN , First Publish Date - 2020-05-16T03:59:56+05:30 IST
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. ముఖ్యంగా యూరప్ ఖండంలో ఈ వైరస్ విలయతాండవం చేస్తోంది.
లండన్: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. ముఖ్యంగా యూరప్ ఖండంలో ఈ వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఇటలీ, స్పెయిన్ దేశాలను గజగజలాడించిన కరోనా.. ప్రస్తుతం బ్రిటన్లో విజృంభిస్తోంది. ఈ దేశంలో కొత్తగా 384 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం బ్రిటన్లో నమోదైన కరోనా మరణాల సంఖ్య 33,998కి చేరింది. అలాగే కొత్తగా 3,560 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,36,711కు చేరింది. ఇప్పటి వరకు ఇంగ్లండ్ దేశంలో మొత్తమ్మీద 23,53,078 కరోనా టెస్టులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.