ఉమ్మడి ఖమ్మంలో 89మందికి కొవిడ్‌

ABN , First Publish Date - 2020-12-01T05:14:27+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం 89మంది కొవిడ్‌ బారిన పడ్డారు.

ఉమ్మడి ఖమ్మంలో 89మందికి కొవిడ్‌

కొత్తగూడెం కలెక్టరేట్‌ / ఖమ్మం సంక్షేమవిభాగం, నవంబరు 30: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం 89మంది కొవిడ్‌ బారిన పడ్డారు. భద్రాద్రికొత్తగూడెంలో 68మందికి, ఖమ్మంజిల్లాలో 21మందికి పాజిటివ్‌ వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం మొత్తం 1,402 మందికి పరీక్షలు నిర్వహించగా.. 68మందికి పాజిటివ్‌ వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగూడెం డివిజన్‌లో 37, భద్రాచలం డివిజన్‌లో 31 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో 21మంది కరోనా బారిన పడ్డారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తమ రోజువారీ నివేదికలో పేర్కొన్నారు.

Updated Date - 2020-12-01T05:14:27+05:30 IST