హైదరాబాద్ మెట్రోకు ప్రయాణికుల కరువు

ABN , First Publish Date - 2020-09-24T17:35:13+05:30 IST

కరోనా ఎఫెక్ట్‌తో హైదరాబాద్ మెట్రోకు ప్రయాణీకుల నుంచి స్పందన కరువైంది.

హైదరాబాద్ మెట్రోకు ప్రయాణికుల కరువు

హైదరాబాద్: కరోనా ఎఫెక్ట్‌తో హైదరాబాద్ మెట్రోకు ప్రయాణీకుల నుంచి స్పందన కరువైంది. మెట్రో సర్వీసులు ప్రారంభమై 20 రోజులవుతున్నా.. ప్రయాణీకులు లేక నగరంలోని మెట్రో స్టేషన్లు బోసిపోతున్నాయి. గతంలో ఉన్న స్థాయిలో ఇప్పుడు ప్రయాణీకులు రావడంలేదు. గతంలో రోజుకు సుమారు మూడు లక్షల మంది ప్రయాణించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడంలేదు. ఇప్పుడు రోజుకు 20 వేల నుంచి 25 వేల మందే ప్రయాణం చేస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో మెట్రో యాజమాన్యం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ప్రయాణీకులు ఎక్కువగా తమ సొంత వాహనాల్లో ఆఫీసులకు వెళుతున్నారు. 

Updated Date - 2020-09-24T17:35:13+05:30 IST