పిల్లల గుండెకు కరోనా గండం!!
ABN , First Publish Date - 2020-09-07T18:50:29+05:30 IST
కరోనా మహమ్మారి బారినపడిన పిల్లల గుండెను గుల్లబారుస్తోంది ‘మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్’ (ఎంఐఎస్ -సీ). వైరస్ సోకిన నాలుగు వారాల తర్వాత
కోలుకున్న నాలుగువారాల తర్వాత బయటపడుతున్న ‘ఎంఐఎ్స-సీ’ సిండ్రోమ్.. టెక్సస్ వర్సిటీ అధ్యయనం
హ్యూస్టన్ (అమెరికా), సెప్టెంబరు 6 : కరోనా మహమ్మారి బారినపడిన పిల్లల గుండెను గుల్లబారుస్తోంది ‘మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్’ (ఎంఐఎస్ -సీ). వైరస్ సోకిన నాలుగు వారాల తర్వాత గానీ.. ఆ మాయదారి ‘సిండ్రోమ్’ చాపకింద నీరులా పిల్లల గుండెను హైజాక్ చేసి గుప్పిట్లోకి తీసుకున్న విషయం బయటపడటం లేదు. ఈ ఆకస్మిక ముప్పు ముంచుకొచ్చి అభం శుభం ఎరుగని పిల్లల ఆరోగ్యాలను కోలుకోలేనంత దెబ్బ తీస్తోందని తాజా అధ్యయనాల్లో గుర్తించారు. జనవరి నెలలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఎంఐఎ్స-సీ కేసులు పెరుగుతూపోతున్నాయని అమెరికాలోని టెక్సస్ వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది.
జనవరి 1 నుంచి జూలై 25 మధ్య ప్రపంచవ్యాప్తంగా నమోదైన 662 ఎంఐఎ్స-సీ కేసుల వివరాల పరిశీలన అనంతరం వారు ఈ నిర్ధారణకు వచ్చారు. ఈ పిల్లలంతా జ్వరంతో బాధపడగా.. 73.7 శాతం మందికి కడుపు నొప్పి లేదా అతిసారం, 68.3 శాతం మంది వాంతులు చేసుకున్నారని తెలిపారు. కరోనాతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చేరిన పిల్లల్లో 71 శాతం మందిలో ఎంఐఎ్స-సీ ఉన్నట్లు తేలిందన్నారు. సగటున 7.9 రోజులపాటు ఆస్పత్రిలో చికిత్సపొందిన పిల్లల్లో 60 శాతం మందిలో వ్యాధి నిరోధక వ్యవస్థ అతిగా స్పందించడాన్ని గుర్తించామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఎంఐఎ్స-సీ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన పిల్లల గుండెలోని కండరాలు, కవాటాల పనితీరును తెలుసుకునేందుకు ఎలకో్ట్ర కార్డియోగ్రఫీ(ఈసీజీ) పరీక్ష నిర్వహించగా 54ు పరిస్థితి అసాధారణంగా ఉన్నట్లు వెలుగుచూసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో మొత్తం 662 మంది పిల్లల్లో ఐదోవంతు మందికి మెకానికల్ వెం టిలేషన్ అందించినా.. 11 మంది చికిత్సపొందుతూ మరణించారన్నారు.