కరోనా నేపథ్యంలో టీటీడీ మరో నిర్ణయం.. రేపట్నుంచి..!
ABN , First Publish Date - 2020-03-27T13:55:25+05:30 IST
ఇప్పటికే శ్రీవారి దర్శనాలను రద్దు చేసి ఘాట్రోడ్లను మూసేయగా..
తిరుమల: తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శనివారం నుంచి సంగీత కార్యక్రమాలు రద్దు కానున్నట్టు తెలుస్తోంది. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఇప్పటికే శ్రీవారి దర్శనాలను రద్దు చేసి ఘాట్రోడ్లను మూసేశారు. షెడ్యూల్ ప్రకారం ఇతర రాష్ట్రాల కళాకారులు నాదనీరాజనం వేదికపై కార్యక్రమాలు నిర్వహిం చాల్సి ఉన్నప్పటికీ రద్దు చేశారు.
అయితే.. నాదనీరాజనం వేదిక ఖాళీగా ఉండకూడదనే ఉద్దేశంతో ఐదు రోజులుగా జిల్లాకు చెందిన కళాకారులతోనే కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారు. తాజాగా 144 సెక్షన్ అమల్లో ఉండటంతో జిల్లాకు చెందిన వారూ తిరుమలకు చేరుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం గాత్ర కచేరి నిర్వహించి... శనివారం నుంచి కార్యక్రమాలను నిలిపివేయనున్నట్టు తెలిసింది. కాగా, గురువారం సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆస్థాన విద్యాంసుడు గురజాల మధుసూదనరావు అన్నమయ్య కీర్తనలను ఆలపించారు.