ఆర్థిక కష్టాల్లో ఈసీబీ
ABN , First Publish Date - 2020-08-07T09:45:14+05:30 IST
కరోనా మహమ్మారి దెబ్బకు ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డుకు ఈ ఆర్థిక సంవత్సరంలో 1794 కోట్ల రూపాయల..
లండన్: కరోనా మహమ్మారి దెబ్బకు ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డుకు ఈ ఆర్థిక సంవత్సరంలో 1794 కోట్ల రూపాయల లోటు ఏర్పడనున్నట్టు అంచనా. ఈ నేపథ్యంలో పొదుపు చర్యలకు బోర్డు శ్రీకారం చుట్టనుంది. ‘ప్రస్తుతం పాకిస్థాన్తో సిరీస్ జరుగుతోంది. వచ్చేనెలలో ఆస్ట్రేలియాతో ఆరు మ్యాచ్ల వైట్బాల్ సిరీస్ నిర్వహించనున్నారు. ఈ రెండింటి తర్వాత కూడా అంత మొత్తంలో నష్టం ఏర్పడనుంది’ అని గార్డియన్ పత్రిక పేర్కొంది.