కరోనా భయం..... పొలాల్లోకి కాపురం

ABN , First Publish Date - 2021-05-14T05:17:23+05:30 IST

కరోనా భయం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది.జనారణ్యంలో వుండి వైరస్‌ బారిన పడడం కంటే పొలాల వద్ద వుండడమే క్షేమమని తలచి పలువురు పల్లెవాసులు కాపురాలను మార్చేస్తున్నారు.

కరోనా భయం..... పొలాల్లోకి కాపురం

పలమనేరు రూరల్‌, మే13:   కరోనా భయం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది.జనారణ్యంలో వుండి వైరస్‌ బారిన పడడం కంటే పొలాల వద్ద వుండడమే క్షేమమని తలచి పలువురు పల్లెవాసులు కాపురాలను మార్చేస్తున్నారు.తట్ట,బుట్ట సర్దుకుని బిడ్డాపాపలను తీసుకొని పొలాల వద్దకు తరలిపోతున్నారు.అక్కడ వసతులు అంతంతమాత్రంగానే ఉన్నా కరోనాకు దూరంగా వుంటామన్న నమ్మకంతో  అక్కడే తలదాచుకుంటున్నారు.పలమనేరు మండలం రామాపురం, నక్కపల్లె గ్రామాలకు చెందిన కొన్ని  కుటుంబాలు ఇలా పొలాల వద్ద నివాసమేర్పరచుకున్నాయి.  


Updated Date - 2021-05-14T05:17:23+05:30 IST