11 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-12-02T06:24:55+05:30 IST
జిల్లాలో గడిచిన 24 గంటల్లో మరో 11 మంది కరోనా బారిన పడ్డారు. కొత్త మరణాలు నమోదు కాలేదు.
అనంతపురం వైద్యం, డిసెంబరు1: జిల్లాలో గడిచిన 24 గంటల్లో మరో 11 మంది కరోనా బారిన పడ్డారు. కొత్త మరణాలు నమోదు కాలేదు. దీంతో జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 158045కి చేరింది. ఇందులో 156885 మంది ఆరోగ్యంగా కోలుకోగా.. 1093 మంది మరణించారు. ప్రస్తుతం 67 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.