330 మందికి కరోనా
ABN , First Publish Date - 2020-08-14T10:49:57+05:30 IST
జిల్లాలో గడిచిన 24 గంటల్లో 330 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, ఒకరు మృతి చెందారు. దీంతో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 11,445కు, మృతు
ఒకరు మృతి ఫ 280 మంది డిశ్చార్జి
విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో గడిచిన 24 గంటల్లో 330 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, ఒకరు మృతి చెందారు. దీంతో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 11,445కు, మృతుల సంఖ్య 218కు చేరింది. 280 మంది డిశ్చార్జి అయ్యారు. జిల్లాలో కరోనా కట్టడి దిశగా ఎలాంటి చర్యలు లేకపోవడం, ప్రజలు సైతం జాగ్రత్తలు తీసుకోకుండా రోడ్లపైకి వచ్చేస్తుండటంతో కేసుల ఉధృతి పెరుగుతూనే ఉంది. నగరంలోని రామలింగేశ్వరనగర్లో గురువారం 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.