జిల్లాలో 63 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-10-20T07:20:54+05:30 IST

జిల్లాలో కొత్తగా మరో 63 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదలచేసిన బులిటెన్‌లో పేర్కొన్నారు

జిల్లాలో 63 మందికి కరోనా

కరీంనగర్‌, అక్టోబర్‌ 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కొత్తగా మరో 63 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదలచేసిన బులిటెన్‌లో పేర్కొన్నారు. సోమవారం స్థానికుల సమాచారం మేరకు జిల్లాల్లో దాదాపు 110 మంది వరకు కరోనా సోకినట్లు తెలి సింది.  హుజురాబాద్‌ డివిజన్‌ పరిధిలోని జమ్మికుంట మం డలంలో నలుగురికి, హుజురాబాద్‌ మండలంలో ఐదు గురికి,  శంకరపట్నంలో ఒకరికి, ఇల్లందకుంట మండలంలో ఒకరికి కరోనా వ్యాధిసోకింది. అలాగే కరీంనగర్‌ డివిజన్‌ పరిధిలోని తిమ్మాపూర్‌ మండలంలో ఒకరికి, మానకొం డూర్‌ మండలంలో నలుగురికి, చొప్పదండిలో ఐదుగురికి, రామడుగులో ఇద్దరికి, గంగాధర మండలంలో ముగ్గురికి,  చిగురుమామిడి మండలంలో ఒకరికి,  కొత్తపల్లి మండలం లో ముగ్గురికి  కరోనా నిర్ధారణ అయింది. కరీంనగర్‌ పట్టణంలోని తిరుమల్‌నగర్‌లో ఒకరు, కట్టరాంపూర్‌లో ఒకరు, భగత్‌నగర్‌లో ముగ్గురు, లక్ష్మీనగర్‌లో ముగ్గురు, మారుతీనగర్‌లో ఇద్దరు, శ్రీనగర్‌కాలనీలో ముగ్గురు, హౌసింగ్‌ బోర్డుకాలనీలో ఇద్దరు, బ్యాంకు కాలనీలో ఒకరు, వావిలాలపల్లిలో ఒకరు వ్యాధిబారిన పడ్డారు.  

Updated Date - 2020-10-20T07:20:54+05:30 IST