నిమ్స్లో 8 మంది డాక్టర్లకు కరోనా
ABN , First Publish Date - 2020-06-03T20:36:09+05:30 IST
ఇప్పటి వరకు హైదరాబాద్లో పోలీసులకు, మెడికల్ విద్యార్థులకు కరోనా సోకితే..
హైదరాబాద్: ఇప్పటి వరకు హైదరాబాద్లో పోలీసులకు, మెడికల్ విద్యార్థులకు కరోనా సోకితే.. ఇప్పుడు ఏకంగా నిమ్స్ డాక్టర్లకే పాజిటీవ్ అని నిర్ధారణ అయింది. నిమ్స్లో 8 మంది డాక్టర్లకు కరోనా వచ్చినట్లు తేలడంతో కలకలం రేగుతోంది. నిమ్స్ డాక్టర్లేకాదు. ఉస్మానియా మెడికల్ పీజీ విద్యార్థులకు కూడా కరోనా సోకింది. ఇప్పటి వరకు 23 మంది మెడికల్ పీజీ విద్యార్థులకు కరోనా సోకినట్లు సమాచారం. ఈ నెల 20 నుంచి ఉస్మానియా పీజీ పరీక్షలు మొదలుకానున్నాయి. దీంతో పీజీ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.