పది మందికి కరోనా
ABN , First Publish Date - 2021-11-28T06:17:41+05:30 IST
జిల్లాలో శనివారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మరణాలు సంభవించలేదు.
అనంతపురం వైద్యం నవంబరు 27: జిల్లాలో శనివారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మరణాలు సంభవించలేదు. దీం తో జిల్లావ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,58,009కి చేరగా.. అందులో 1,56,856 మంది కోలుకో గా.. 1093 మంది మరణించారు. ప్రస్తుతం 60 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.