తెలంగాణలో పెరుగుతున్న కరోనా

ABN , First Publish Date - 2022-01-28T01:32:27+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా పరిస్థితులపై

తెలంగాణలో పెరుగుతున్న కరోనా

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడదల చేశారు. తెలంగాణలో కొత్తగా 3,944 కరోనా కేసులు, నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు మృతి చెందారు. తెలంగాణలో మొత్తం 7,51,099 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 4,081 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 39,520 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 7,07,498 మంది రికవరీ చెందారు. 



దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,86,385 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అవగా...573 మంది మృతి చెందారు. దాదాపు 3,06,357 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 22,02,472 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. రోజువారీ కొవిడ్ పాజిటివీటీ రేటు 19.59 శాతంగా నమోదు అయ్యింది. టీకా తీసుకున్న వారి సంఖ్య 1,63,84,39,207గా ఉంది. 

Updated Date - 2022-01-28T01:32:27+05:30 IST