హన్మకొండ బస్ డిపోలో కరోనా కలకలం
ABN , First Publish Date - 2022-01-17T02:07:28+05:30 IST
హన్మకొండ బస్ డిపోలో కరోనా కలకలం రేపింది. వరంగల్ లోకల్ బస్సులో మహిళా కండక్టర్కి కరోనా సోకింది. 15 రోజుల పాటు సిక్ లీవ్లో ఉండి మహిళా
వరంగల్: హన్మకొండ బస్ డిపోలో కరోనా కలకలం రేపింది. వరంగల్ లోకల్ బస్సులో మహిళా కండక్టర్కి కరోనా సోకింది. 15 రోజుల పాటు సిక్ లీవ్లో ఉండి మహిళా కండక్టర్ వచ్చారు. 2 రోజుల క్రితం డ్యూటీలో జాయిన్ అయినట్లు సమాచారం. శనివారం నుండి దగ్గు వస్తుండటంతో అధికారులు కరోనా టెస్ట్ చేయించారు. పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఆర్టీసీ సిబ్బంది ఆందోళనలో ఉంది. డ్యూటీ ఆఫీసర్కు కూడా కారోనా లక్షణాలు ఉన్నట్లు చెబుతున్నారు.
శరవేగంగా వ్యాపించే ఒమైక్రాన్ ప్రభావం రాష్ట్రంలోనూ కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే వేరియంట్ వ్యాప్తి ప్రారంభమైంది. ప్రస్తుత పాజిటివ్లలో 95% లక్షణాలు లేనివారేనని, వీరితోనే ఎక్కువ వ్యాప్తి జరుగుతున్నట్లు వైద్య శాఖ అభిప్రాయపడుతోంది. ఈ కేసుల్లో 70ు పైగా ఒమైక్రాన్వేనని వెల్లడించింది. ఈ వేరియంట్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో నిర్ధారణ కావడం లేదని వైద్యులు చెబుతున్నారు. వీరికి ఆర్టీపీసీఆర్లో పాజిటివ్గా తేలుతోందని వివరిస్తున్నారు.