కరోనా సోకిన వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-08-13T11:03:34+05:30 IST
కరోనా వైరస్ సోకిందనే మనస్థాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాడ్డాడు. సీఐ ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి
సిరికొండ, ఆగస్టు 12 : కరోనా వైరస్ సోకిందనే మనస్థాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాడ్డాడు. సీఐ ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండ లంలోని న్యావనంది గ్రామానికి చెందిన లోలం పెద్ద రాజన్నకు ఈ నెల 7న సిరికొండ ప్రభుత్వ ఆసు పత్రిలో పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. అత డితోపాటు భార్య, మనుమరాలు, కూతురుకు కూడా కరోనా పాజిటివ్ సోకడంతో వారు ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉండి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. పెద్ద రాజన్న బుధవారం తెల్లవా రు జామున పొలం వద్దకు వెళ్లి వస్తానని భార్యకు చెప్పి వెళ్లాడు. పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘ టనా స్థలాన్ని ధర్పల్లి సీఐ ఎం.ప్రసాద్, వైద్యాధికారి డాక్టర్ మోహన్ సందర్శించారు. రాజన్న సోదరుడు చిన్న రాజన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసు కొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రసాద్ తెలిపారు.