కాకతీయ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం
ABN , First Publish Date - 2022-01-09T22:06:36+05:30 IST
కాకతీయ వైద్య కళాశాలలో మళ్లీ కరోనా పడగవిప్పింది. విద్యనభ్యసిస్తున్న మరో ఐదుగురు మెడికోలకు ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో
వరంగల్: కాకతీయ వైద్య కళాశాలలో మళ్లీ కరోనా పడగవిప్పింది. విద్యనభ్యసిస్తున్న మరో ఐదుగురు మెడికోలకు ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు 25 మంది మెడికోలకు కరోనా సోకింది. దీంతో తోటి మెడికోలు, ప్రొఫెసర్లు భయాందోళన చెందుతున్నారు. శనివారం 195 మంది మెడికోలకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా 20 మందికి పాజిటివ్గా నిర్దారణ జరిగింది. వెంటనే ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బత్తుల శ్రీనివాస్, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాస్ అప్రమత్తం అయ్యారు. పాజిటివ్గా నిర్ధారణ అయిన మెడికోలను ఐసోలేషన్లో ఉంచేందుకు చర్యలు చేపట్టారు.