కళ్యాణదుర్గoలో కరోనా కలకలం.. పెరుగుతున్న కోవిడ్ కేసులు

ABN , First Publish Date - 2020-07-06T02:48:26+05:30 IST

కళ్యాణదుర్గoలో కరోనా కలకలం.. పెరుగుతున్న కోవిడ్ కేసులు

కళ్యాణదుర్గoలో కరోనా కలకలం.. పెరుగుతున్న కోవిడ్ కేసులు

అనంతపురం: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కళ్యాణదుర్గo ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మనిరేవు కొండాపురంలో మూడు రోజుల క్రితం ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. కరోనా సోకిన వ్యక్తి నుంచి ఒకేసారి కుటుంబంలో ఈ రోజు ముగ్గురికి, స్నేహితుడికి కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. శెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ వ్యక్తి బొచ్చుపల్లి గ్రామంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తితో కాంటాక్టు అయినట్లు అధికారులు తెలిపారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం మొత్తం 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-06T02:48:26+05:30 IST