మేడిపల్లి పీఎస్లో కరోనా కలకలం
ABN , First Publish Date - 2022-01-14T23:51:46+05:30 IST
కరోనా వైరస్ పంజా విసురుతోంది. మహమ్మారి బారిన పడుతున్న వారు పెరుగుతూనే ఉన్నారు. రాష్ట్రంలో జిల్లాలతో పొల్చుకుంటే గ్రేటర్
మేడ్చల్: కరోనా వైరస్ పంజా విసురుతోంది. మహమ్మారి బారిన పడుతున్న వారు పెరుగుతూనే ఉన్నారు. రాష్ట్రంలో జిల్లాలతో పొల్చుకుంటే గ్రేటర్ హైదరాబాద్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి పోలీసులను వెంటాడుతోంది. మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కరోనా కలకలం రేపుతోంది. సీఐ, డీఐ, ముగ్గురు కానిస్టేబుల్స్, హోంగార్డ్కు కరోనా పాజిటివ్గా నిర్ధారించారు. కరోనా బారిన పడ్డ పోలీసులు హోంక్వారంటైన్లో చికిత్స పొందుతున్నారు. జనం కనీస నిబంధనలు పాటించడంలేదు. భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా తిరిగేస్తున్నారు. వాణిజ్య సంస్థల్లోనూ సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీంతో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.