నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే..
ABN , First Publish Date - 2021-04-11T09:05:28+05:30 IST
మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో బీసీసీఐ కూడా ముంబై మ్యాచ్ల విష యంలో కఠిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్ల కోసం వచ్చే అధికారులంతా...
ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో బీసీసీఐ కూడా ముంబై మ్యాచ్ల విష యంలో కఠిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్ల కోసం వచ్చే అధికారులంతా తప్పనిసరిగా ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ రిపోర్టును స్టేడియం ఎంట్రీ దగ్గరే చూపించాల్సి ఉంటుంది. అది కూడా మ్యాచ్కు రెండ్రోజుల ముందు నిర్వహించిన పరీక్షల రిపోర్టుతో లోపలికి అనుమతి ఉంటుందని, వ్యాక్సిన్ తీసుకున్నా కూడా నెగెటివ్ రిపోర్ట్ ఉండాల్సిందేనని మహారాష్ట్ర క్రికెట్ సంఘం కార్యదర్శి సంజయ్ నాయక్ స్పష్టం చేశాడు. ఈనెల 25 వరకు ఇక్కడ పది మ్యాచ్లు జరుగుతాయి.