రాష్ట్రంలో తగ్గని కరోనా
ABN , First Publish Date - 2020-11-22T08:30:24+05:30 IST
రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 1,160 మంది కరోనా బారినపడ్డారు. 24 గంటల వ్యవధిలో 68,307 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,160 మందికి పాజిటివ్
కొత్తగా 1160 కేసులు... ఏడుగురి మృతి
పశ్చిమలో విద్యార్థి, టీచర్కు పాజిటివ్
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్)
రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 1,160 మంది కరోనా బారినపడ్డారు. 24 గంటల వ్యవధిలో 68,307 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,160 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తంగా ఇప్పటి వరకు 8,61,092 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,39,395 మంది కరోనా నుంచి బయటపడ్డారు. 14,770 మంది చికిత్స పొందుతున్నారు. శనివారం అన్ని జిల్లాల్లో కలిపి ఏడుగురు మృతి చెందారు. చిత్తూరులో ఇద్దరు, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, కృష్ణాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,927 మంది వైర్సకు బలయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా గణపవరం మండలంలోని పాఠశాలలో ఓ విద్యార్థికి, దెందులూరు మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో టీచరుకు పాజిటివ్ నిర్ధారణ అయింది.