కంగ్టిలో కరోనా పేషంట్ హల్చల్
ABN , First Publish Date - 2021-04-09T03:31:56+05:30 IST
కంగ్టిలో కరోనా పేషంట్ హల్చల్
సంగారెడ్డి: కంగ్టిలో కరోనా పేషంట్ హల్చల్ చేశారు. రోడ్లపైకి వచ్చి మార్కెట్లో అందరిని కలిశారు. 2 రోజుల క్రితం కరోనా వచ్చిందని అధికారులు హోం ఐసోలేషన్లో ఉంచారు. ఇంట్లో వాళ్లు చూడకుండా కరోనా బాధితుడు బయటికి వచ్చారు. పీపీఈ కిట్ ధరించి వైద్యసిబ్బంది వ్యక్తిని పట్టుకుని హైదరాబాద్కు పంపారు. మతిస్థిమితం లేక అలా ప్రవర్తించాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. గ్రామస్తులందరికీ టెస్టులు చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు.