ఏపీలో 314కు చేరిన కరోనా కేసులు.. మంగళవారం ఒక్కరోజే....

ABN , First Publish Date - 2020-04-08T04:12:32+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 10 కరోనా...

ఏపీలో 314కు చేరిన కరోనా కేసులు.. మంగళవారం ఒక్కరోజే....

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. మంగళవారం నమోదైన కేసులతో ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 314 కేసులు నమోదు అయినట్లు హెల్త్ బులెటిన్‌లో వైద్యులు పేర్కొన్నారు. ఆరుగురు కోలుకున్నారని వెల్లడించారు. 


ఏపీలో జిల్లాలవారీగా కరోనా పాజిటివ్‌ కేసులు: 

  • కర్నూలు 74, నెల్లూరు 43, గుంటూరు 41, కృష్ణా 29, కడప 28
  • ప్రకాశం 24, విశాఖ 20, చిత్తూరు 17, ప.గో. 21, తూ.గో. 11
  • అనంతపురంలో 6 కరోనా పాజిటివ్‌ కేసులు 


అయితే ఏపీ ప్రభుత్వం కరోనా రోగుల కోసం ప్రైవేటు ఆస్పత్రుల నుంచి వెంటిలేటర్లు తీసుకుంది. ఈ కాలనికి అద్దె చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. అద్దె చెల్లించడంతో పాటు తీసుకున్న వెంటిలేటర్లను సురక్షితంగా ప్రైవేటు ఆస్పత్రులకు అప్పగించే బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకున్నట్లు ప్రకటించింది. 


Updated Date - 2020-04-08T04:12:32+05:30 IST